నట్టి కుమార్ తనయుడిపై దాడి

సినీ నిర్మాత నట్టి కుమార్ కుమారుడు నట్టి క్రాంతిపై అర్ధరాత్రి పోలీసులు దాడికి పాల్పడ్డారు.

Update: 2020-01-01 04:19 GMT

సినీ నిర్మాత నట్టి కుమార్ కుమారుడు నట్టి క్రాంతిపై అర్ధరాత్రి పోలీసులు దాడికి పాల్పడ్డారు. కంట్రీక్లబ్‌లోకి తమను వెళ్లకుండా అడ్డుకున్నారని... పార్కింగ్ చేస్తామని కారు కీస్ తీసుకుని ఇవ్వకపోవడంతో నట్టి క్రాంతి డయల్ హండ్రెడ్‌కు ఫోన్ చేశారు. కంట్రీక్లబ్‌కు చేరుకున్న పోలీసులు.. డయల్ హండ్రెడ్‌కు ఫోన్ చేస్తావా అంటూ క్రాంతిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో నట్టి కుమార్ పంజాగుట్ట పీఎస్‌లో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

ఈ సందర్భంగా నట్టికుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. కంట్రీ క్లబ్‌ ఈవెంట్‌ మేనేజర్‌ సుమన్‌ ఇయర్‌ ఎండ్‌ సెలబ్రేషన్‌ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు నమ్మబలికి చాలా మందిని మోసం చేశాడని ఆరోపించారు. అతన్ని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశాడు. తన కుమారుడిపై దాడి ఘటనకు పోలీసులు క్షమాపణ చెప్పారని వెల్లడించారు. కాగా, కంట్రీ క్లబ్‌ వద్ద కారు పార్క్‌ చేస్తామని చెప్పి కీ తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో క్రాంతి 100కు ఫోన్‌ చేసినట్టుగా తెలుస్తోంది.  చివరికి పోలీసులు క్షమాపణలు చెప్పడంతో నట్టి కుమార్ శాంతించారు.

Tags:    

Similar News