తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరికొద్ది రోజుల్లో వరంగల్ నగర పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన నగరంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. కాగా వాటికి సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులు భద్రకాళి బండ్, బల్దియా ప్రధాన కార్యాల యం ఎదురుగా పోతన విగ్రహం, వరంగల్ ఇసుక అడ్డాల వద్ద ఫ్లై ఓవర్, సెంట్రల్ జైలు నర్సరీ పనులను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం రాంపూర్ స్టేషన్ పెండ్యాలలో 'కుడా' ఆధ్వర్యంలో రూ.4కోట్ల వ్యయంతో ఏర్పాటుచేస్తున్న ఆక్సిజన్ పార్కుకు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని కూడా సందర్శించారు. పార్కు ప్రదేశంలో ముళ్లపొదలు తొలగించాలని, గుంతలు పూడ్చాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గుండు సుధారాణి పాల్గొన్నారు. అంతరం కాజీపేటలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాన్ని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, కమిషనర్ సత్పతితో కలిసి కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు పరి శీలించారు.