డబ్బుల విషయంలో గొడవ.. 4కోట్ల విలువైన లగ్జరీ కారుకు నిప్పు

హైదరాబాద్‌ పహడీ షరీఫ్‌లో ఘటన

Update: 2024-04-15 12:59 GMT

 డబ్బుల విషయంలో గొడవ.. 4కోట్ల విలువైన లగ్జరీ కారుకు నిప్పు

తీసుకున్న అప్పు కట్టలేదని ఖరీదైన కారును తగులపెట్టిన ఘటన హైదరాబాద్‌ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నార్సింగికి చెందిన వ్యాపారి నీరజ్‎కు 4 కోట్ల విలువ చేసే స్పోర్ట్స్ కారు ఉంది. దాన్ని విక్రయిస్తానని మోఘల్‌పురా‌కు చెందిన అమన్‌కు చెప్పాడు. ఆ కారును కొంటానని తమ ఫామ్‌హౌజ్‌కు తీసుకురావాలని అహ్మద్ చెప్పాడు. నీరజ్ ఫ్రెండ్ అయాన్ కారును తీసుకెళ్లాడు. నీరజ్ తనకు 2కోట్లు అప్పు ఇవ్వాల్సిఉందని... అహ్మద్ కారుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News