రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
5 జనవరి, 2020 తేదీలోగా డిగ్రీ మహిళా కళాశాలల్లో ఆడ్మిషన్ పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో విద్యాప్రమాణాలు పెంచడానికి సోషల్ వెల్ఫేర్ విద్యాసంస్థలను ప్రభుత్వ ఏర్పాటు చేసింది. ప్రైమరీ తరగతుల నుంచి మొదలు పెడితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు నాణ్యమైన విద్యను అందించడానికి ఈ విద్యాసంస్థలను ఏర్పాటుచేసారు. ప్రతీ ఏడాది ఎంతో మంది విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసుకుని విద్యాసంస్థల నుంచి బయటికి వెలతారు. ఇదిలా ఉంటే ఈ విద్యాసంస్థల్లో ప్రతీ ఏడాది ప్రవేశం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది. ఇదే తరహాలో ఈ ఏడాది కూడా నోటిఫికేషన్ ను జారీ చేసింది.
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా కళాశాలల్లో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 2020- 2021 విద్యా సంవత్సరానికి గాను ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నటు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కల్గిన విద్యార్థినుల నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
5 జనవరి, 2020 తేదీలోగా డిగ్రీ మహిళా కళాశాలల్లో ఆడ్మిషన్ పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష జనవరి 19న జరుగుతుందన్నారు. వివరాలకు www.tswreis.in/. htpp// tgtwgurukulam& telangana.gov.in ను సంప్రదించాలని అధికారులు ప్రకటనలో తెలిపారు.