గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు

* మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజసింగ్‌పై కేసు నమోదు

Update: 2022-12-09 05:48 GMT

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు

MLA RajaSingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు అయింది. ట్విట్టర్ ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు రావడంతో మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజసింగ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. శౌర్య దివస్ అని ఒక ఫొటోను రాజసింగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా బాబ్రీ మసీదు కూల్చి వేతపై మతపరమైన అభ్యంతరం ఇది అంటూ కొంతమంది ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు ఆర్డర్ ఉన్నా సరే.. ఇలా ట్వీట్ చేశారని ఫిర్యాదుదారులు కంప్లైంట్ చేశారు.

Tags:    

Similar News