Amaravati Farmers: మేడారం జాతరకు అమరావతి రైతులు.. ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న అమరావతి మహిళ !

Update: 2020-02-08 08:55 GMT

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు మేడారం జాతరకు తరలివచ్చారు. అమరావతి రాజధానిగా పరిపాలన సాగాలని వారు అమ్మవారిని కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానులు వద్దని, అమరావతే ముద్దని అమ్మవారిని వేడుకున్నారు. తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసు మార్చాలని కోరుతూ నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు.

ఈ సందర్భంగా అమరావతి రైతులు కన్నీరు పెట్టుకున్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం అక్కడే ఉన్న ఎమ్మెల్యే సీతక్కను కలుసుకున్నారు. తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఎమ్మెల్యే సీతక్క కాళ్లు పట్టుకుని తమ సమస్యను తీర్చాలని కోరింది. ఆమెను ఎమ్మెల్యే సీతక్క ఓదార్చారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలని ఆమె ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    

Similar News