అక్బరుద్దీన్ ఒవైసీకి కీలక పదవి
అసెంబ్లీ కమిటీలను స్పీకర్ ప్రకటించారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అక్బరుద్దీన్ ఒవైసీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్గా స్పీకర్ పోచారం ప్రకటించారు. అంచనాల కమిటీ చైర్మన్గా సోలిపేట లింగారెడ్డి, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్గా ఆశన్నగారి జీవన్రెడ్డి స్పీకర్ ప్రకటించారు.
తెలంగాణ శాసనసభ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ కమిటీలను స్పీకర్ ప్రకటించారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అక్బరుద్దీన్ ఒవైసీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్గా స్పీకర్ పోచారం ప్రకటించారు. అంచనాల కమిటీ చైర్మన్గా సోలిపేట లింగారెడ్డి, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్గా ఆశన్నగారి జీవన్రెడ్డి స్పీకర్ ప్రకటించారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ప్రకాశ్గౌడ్, అబ్రహం, శంకర్నాయక్, దాసరి మనోహర్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, అహ్మద్ పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్లను నియమించారు. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నడిచాయి. 58 గంటల 6 నిమిషాలు శాసనసభ సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశంలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది.