ఆర్టీసీ పై మళ్లీ సమీక్ష నిర్వహించిన సీఎం
సోమవారం హైకోర్టులో ఆర్టీసి కార్మికులకు సంభంధించిన విచారణ ఉండగా సీఎం శనివారం రాత్రి అధికారులతో మళ్లీ సమీక్ష నిర్వహించారు.
సోమవారం హైకోర్టులో ఆర్టీసి కార్మికులకు సంభంధించిన విచారణ ఉండగా సీఎం కేసీఆర్ శనివారం రాత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం, శనివారం మళ్లీ చర్చలను నిర్వహించారు. కోర్టు ఏ విధమైన ఉత్తర్వులు ఇస్తుందో దాన్నిబట్టి తదుపరి కార్యాచరణ ఏం చేయాలన్న విషయాలపైన వారు చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశ వివరాలను గురించి సీఎం కార్యాలయం నుంచి అధికారికంగా వెలువరించకపోవడం విశేషం. కోర్టు ఎలా స్పందింస్తుందో వేచి చూద్దామని, ప్రభుత్వానికి వ్యతిరేక దృక్పథంతో కోర్టు ఉందని సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ స్పందించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్కుమార్ సుల్తానియా, ఏసీ ప్రసాద్ తదితరులతో దాదాపు గంటన్నరపాటు ఆయన భేటీ అయ్యారు.