చిక్కడపల్లిలో లారీ బీభత్సం.. ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి

Update: 2020-02-07 06:48 GMT
చిక్కడపల్లిలో లారీ బీభత్సం

హైదరాబాద్‌ చిక్కడపల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద కాలేజ్‌కు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు విద్యార్ధులు కాలేజికి వెళుతున్న సమయంలో ఓ లారీ అదుపు తప్పి విద్యార్థులపై నుంచి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌తో పాటు పోలీసులు లారీని సీజ్ చేశారు.

Tags:    

Similar News