డెంగ్యూకు మరో చిన్నారి బలి

తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇటు హైదరాబాద్‌ వ్యాప్తంగా డెంగ్యూ వణికిస్తోంది. మహా నగర వ్యాప్తంగా డెంగ్యూ ధాటికి ఆసుపత్రులన్ని రోగులతో నిండిపోయాయి.

Update: 2019-09-04 06:19 GMT

తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇటు హైదరాబాద్‌ వ్యాప్తంగా డెంగ్యూ వణికిస్తోంది. మహా నగర వ్యాప్తంగా డెంగ్యూ ధాటికి ఆసుపత్రులన్ని రోగులతో నిండిపోయాయి. తార్నాకా డివిజన్ లోడెంగ్యూ బారిన పడిన ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. లాలపేటకు చెందిన ఐదేళ్ల రుత్విక డెంగ్యూ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే చిన్నారి మృతి చెందింది. ఈ నేపథ్యంలో వైద్యాధికారులు అలర్ట్ ప్రకటించారు. మృతుల సంఖ్య పెరుగుతున్నందున వ్యాధి నియంత్రణకు తక్షణ చర్యలకు ఉపక్రమించారు.

Tags:    

Similar News