మహబూబ్‌నగర్‌లో 23 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్‌

Update: 2020-04-07 11:52 GMT

కరోనా వైరస్‌ మహ్మమారి ఏ ఒక్కరినీ వదలడంలేదు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధులనూ మృత్యు ఒడిలోకి చేర్చుకుంటోంది. తాజాగా 23 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చిన సంఘటన మహబూబ్‌నగర్‌లో వెలుగు చూసింది. మహబూబ్‌నగర్‌లో 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు వెల్లడించారు.

మర్కజ్‌ వెళ్లొచ్చిన వారి ద్వారా కొత్తగా ముగ్గిరికి కరోనా వచ్చిందని వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో నిన్నటివరకు ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న విషయం తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి చెందకుండా రసాయనాలు పిచికారి చేశామని, పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తిస్తున్నామని, ఇప్పటివరకు గుర్తించినవారిని క్వారంటైన్‌ తరలించామని ఆయన తెలిపారు.  


Tags:    

Similar News