షాకింగ్ : నిజామాబాద్‌లో ఒక్కరోజే 16 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-04-04 04:14 GMT

తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. నిజామాబాద్‌లో శుక్రవారం ఒక్కరోజే 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేస్తూ గురువారం నాడు పంపిన 42 శాంపుల్స్ లో 41 మందివి పరీక్షల నివేదికలు వచ్చాయని అందులో 16 గురికి కరోనా వైరస్ సోకినట్లు నివేదికల ద్వారా తెలుస్తుందని అన్నారు.

ఇంకా 25 మందికి నెగటివ్ వచ్చిందని మరొకరి నివేదిక పెండింగ్ లో ఉందని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిని తదుపరి వైద్య చికిత్సలకు గాంధీ ఆసుపత్రి కి పంపిస్తున్నామని నెగిటివ్ వచ్చిన 25 మందిని తదుపరి పర్యవేక్షణకు కొన్ని రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్ లో ఉంచడానికి ఆదేశాలు జారీ చేశామన్నారు.

Tags:    

Similar News