భద్రాధ్రి జిల్లాలో పదో తరగతి విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టేకులపల్లి మండలం కోయగూడెం ఆశ్రమపాఠశాల హెడ్ మాస్టర్ దేవ్ సింగ్ వేధింపులు తాళలేక సాయికిరణ్ ఆత్మహ్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ రాసి ఊరి వేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హరిప్రియ పాఠశాలకు చేరుకుని విద్యార్ధి మృతికి సంబంధించిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.