వరంగల్లో పదేళ్ల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. పూరిగుట్ట ప్రాంతానికి చెందిన చిన్నారికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వరంగల్ డీఎంహెచ్వో లలితా దేవీ ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. దీంతో పాజిటివ్ వచ్చిన చిన్నారిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. అలాగే పూరిగుట్ట ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. బాలిక కుటుంబ సభ్యులు, సన్నిహితులను గుర్తించి ఇప్పటికే వారందరినీ క్వారంటైన్కు తరలించారు. అయితే పాజిటివ్ వచ్చిన ఇంకా ఎవరెవరిని కలిసిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.