కామ్రేడ్ లింగన్న పోస్ట్‌మార్టమ్.. గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..

Update: 2019-08-02 07:11 GMT

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన న్యూ డెక్రమసీ దళ సభ్యుడు లింగన్న రీ పోస్ట్ మార్టం సందర్భంగా గాంధీ ఆసుపత్రి దగ్గర తీవ్ర ఉద్రికత్త రేగింది. పోస్ట్ మార్టం జరుగుతున్న ప్రదేశంలోని తనను అనుమతించాలంటూ POW నాయకురాలు సంధ్య పోలీసులను కోరారు. ఇందుకు పోలీసులు అనుమతించకపోవడంతో బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు సంధ్యకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రైతు కూలీ సంఘం నాయకులు ప్రభాకర్, ఐఎఫ్‌టీయూ సూర్య,పి.రామకృష్ణలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా,రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో కామ్రేడ్ లింగన్నను పోలీసులు ఎన్ కౌంటర్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News