విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సఫారీలు పోరాడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ ను 502/7 వద్ద టీమిండియా డిక్లేర్ చేయగా, బదులుగా దక్షిణాఫ్రికా జట్టు మూడో రోజున 8 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో భారత్కు 117 పరుగులు ఆధిక్యం లభించింది. టీమిండియా బౌలర్ అశ్విన్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసి సఫారీల నడ్డి విరిచాడు.
భారత్తో తొలి టెస్టులో సౌతాఫ్రికా మిడిలార్డర్ గొప్పగా రాణించింది. తొలి ఇన్నింగ్స్ను తడబడుతూ ఆరంభించిన ప్రొటీస్ మూడో రోజు ఆటలో గట్టిగా పుంజుకుంది. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ క్వింటన్ డికాక్ మెరుపు శతకంతో చెలరేగాడు. అశ్విన్ వేసిన 105వ ఓవర్ తొలి బంతికి తనదైన శైలిలో భారీ సిక్సర్ బాది 100 మార్క్ చేరుకున్నాడు. ఓపెనర్ డీన్ ఎల్గర్తో భారీ భాగస్వామ్యం నెలకొల్పిన డికాక్ స్వేచ్ఛగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు.