టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి గురుగ్రామ్ కార్పొరేషన్ అధికారులు జరిమానా విధించారు. కోహ్లీ స్వస్థలమైన గురుగ్రామ్లోని ఆయన నివాసంలో పనిచేసే వాళ్లు చేసిన తప్పుకి కోహ్లీకి జరిమానా పడింది. కోహ్లీ ఇంట్లోని డజన్ కార్లు కడగడానికి లీటర్ల కొద్ది తాగునీటిని వాడుతున్నారట. ఈ విషయం గమనించిన పక్కింటి వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో కోహ్లీకి రూ.500 జరిమానా విధిస్తున్నట్లు చలానా జారీ చేశారు. కోహ్లీతో పాటు మరో 10 మందికి కూడా చలాన్లు జారీ చేసినట్లు మున్సిపల్ ఇంజినీర్ అమన్ ఫొగట్ పేర్కొన్నారు.