ఇండియా- న్యూజిలాండ్ మధ్య జరుతున్న తొలి సెమీస్ను వరుణుడు అడ్డుకున్నాడు. 47వ ఓవర్ తొలి బంతి పడిన తర్వాత చినుకులు ప్రారంభం కావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. భువనేశ్వర్ 46.1వ బంతి వేసిన తర్వాత ఫీల్డ్ అంపైర్లు పిచ్ను, ఔట్ఫీల్డ్ను తనిఖీ చేశారు. ఎక్కువ తేమ ఉండటంతో కవర్లు కప్పాలని మైదానం సిబ్బందికి సూచించారు. వర్షం తగ్గిన తర్వాత పూర్తిస్థాయి ఓవర్లు ఆడే పరిస్థితి లేకపోతే కనీసం 20 ఓవర్లు అయినా ఆడించే అవకాశం ఉంది. అది కూడా సాధ్యం కాకపోతే రిజర్వు డే అయిన బుధవారం తిరిగి మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ 211/5తో ఉంది. రాస్ టేలర్ (67; 85 బంతుల్లో 3×4, 1×6), టామ్ లేథమ్ (3; 4 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.