వెస్టిండీస్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలివన్డేలో లంక జట్టు ఒక్క వికెట్ తో విజయాన్ని సాధించింది. మొదటగా టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన విండిస్ నిర్ణిత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్ షాయ్ హోప్ (115) సెంచరీతో రాణించాడు. షాయ్ హోప్ కి తోడుగా రోస్టన్ చేస్ (49), డారెన్ బ్రావో (41) కూడా జత కలవడంతో విండిస్ జట్టు భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో ఇసురు ఉదానాకు మూడు వికెట్లు దక్కాయి.
ఇక 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు బాట్స్ మెన్స్ అవిష్క ఫెర్నాండో (50), కుశాల్ పెరీరా (42), తిసారా పెరీరా (32) బాగానే రాణించారు. అయితే మధ్యలో విండిస్ బౌలర్లు పుంజుకోవడంతో లంక జట్టు 215 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో హసరంగా తన అద్భుతమైన ఆటతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీనితో 49.1 ఓవర్లలో తోమ్ముది' వికెట్లు కోల్పోయి ఈ విజయాన్ని అందుకుంది. విండిస్ బౌలర్లలో బౌలర్లో అల్జారీ జోసెఫ్, షెల్డన్ కొట్రెల్కు మూడు వికెట్లు తీశారు. దీంతో మూడు వన్డేల సిరీస్లో 1-0తో లంక ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి వన్డే బుధవారం జరుగుతుంది.