బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గంగూలీ ఈరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన బోర్డు సర్వసభ్య సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొడుకు జయ్ షా కార్యదర్శిగా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ కోశాధికారిగా బాధ్యతులు స్వీకరించారు. సౌరవ్ గంగూలీ 13 నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు.