భారత్ రిషభ్ పంత్(32) వికెట్ను కూడా చేజార్చుకుంది. దీంతో 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత్. శాంట్నర్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన రిషభ్ పంత్ బౌండరీ లైన్ వద్ద గ్రాండ్హోమ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 56 బంతులు ఆడిన రిషభ్ పంత్ 4 పోర్లతో 32 పరుగులు చేశాడు. 23 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది.