సొంత మైదానంలో పట్నా పైరేట్స్ ఎట్టకేలకు విజయం
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ యూపీ యోధపై పట్నా పైరేట్స్ విజయం ముంబైపై బెంగాల్ గెలుపు
సొంతగడ్డపై ఆడిన చివరి లీగ్ మ్యాచ్లో పాట్నా పైరేట్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. అంతకు ముందు సొంత వేదికలో జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన పట్నా పైరేట్స్ ఇక్కడి చివరి మ్యాచ్లో మాత్రం విజయం రుచి చూసింది. యూపీ యోధతో జరిగిన ఈ మ్యాచ్లో 41-20 తేడాతో ఘన విజయం సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో పైరేట్స్కు ఇది మూడో విజయం.
ముంబైపై బెంగాల్ గెలుపు
బెంగాల్ వారియర్స్ 32-30తో యూ ముంబాపై గెలిచింది. అదిరే ఆరంభం లభించినా దానిని సద్వినియోగం చేసుకోలేని యు ముంబా సీజన్లో నాలుగో పరాభవాన్ని మూటగట్టుకుంది. బల్దేవ్ సింగ్ హై5 పాయింట్లతో రాణించిన వేళ బెంగాల్ 32-30తో ముంబాపై ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. అటు యూ ముంబా తరఫున అర్జున్ దేశ్వాల్ సూపర్ 10తో ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది.