India vs New Zealand 2nd test Day 2: న్యూజిలాండ్ ఆలౌట్ .. భారత్ కి స్వల్ప ఆధిక్యం
క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్, భారత జట్ల మద్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 235 పరుగులకు ఆలౌట్ అయింది.
క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్, భారత జట్ల మద్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 235 పరుగులకు ఆలౌట్ అయింది.. పిచ్ పేస్ బౌలింగ్ కు అనుకూలించడంతో భారత బౌలర్లు రెచ్చిపోవడంతో కివీస్ జట్టు ఒక్కరోజే పది వికెట్లను కోల్పోయింది. దీనితో భారత్ కి ఏడూ పరుగుల ఆధిక్యం దక్కింది. 63/0తో రెండో రోజు ఆటను తిరిగి ప్రారంభించిన కివీస్ జట్టును భారత బౌలర్లు బాగానే కట్టడి చేశారు..
రెండో రోజు కివీస్కు ఆదిలోనే ఉమేశ్యాదవ్ పెద్ద షాకిచ్చాడు. 25.3 ఓవర్లో టామ్ బ్లండెల్(30)ను ఎల్బీగా పెవిలియన్ పంపాడు. మరో మూడు పరుగుల వ్యవధిలో కెప్టెన్ విలియమ్సన్(3)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రాస్టేలర్(15)తో కలిసి టామ్ లాథమ్(52) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కలిసి 40 పరుగుల జోడించాక జడేజా టేలర్ ని అవుట్ చేసి వీరిని విడదీశాడు. ఇక కాసేపటికే లాథమ్(52) షమి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అనంతరం హెన్రీ నికోల్స్(14)కూడా వెంటనే వెనుదిరిగాడు. దీనితో కివీస్ జట్టు 142 పరుగులకే అయిదు వికెట్లను కోల్పోయింది.
ఇక ఆ తరవాత వచ్చిన డి గ్రాండ్హోమ్(26), కైల్ జేమిసన్(49) కొద్దిసేపు జట్టును ఆదుకున్నారు. దీనితో ఆ జట్టు 200 మార్క్ ని దాటింది. ఆ తర్వాత కివీస్ వరుస వికెట్లను కోల్పోయి 235 పరుగులకు ఆలౌట్ అయింది..ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమి(3), జస్ప్రీత్ బుమ్రా(3), జడేజా (2) వికెట్లు తీయగా.. ఉమేశ్, వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 242 పరుగులకి ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.