ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లు బ్లాక్ మార్కెట్కు తరలిపోయాయి. రేపు జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ కోసం సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్స్కు క్రికెట్ లవర్స్ పోటెత్తారు. వేలాదిగా చేరుకున్న ఫ్యాన్స్ టిక్కెట్లు కొనేందుకు తలలు పట్టుకుంటున్నారు. టిక్కెట్లన్నీ అయిపోవడంతో బ్లాక్ దందాకు తెరతీశారు. గ్రౌండ్ గేట్ ముందే బ్లాక్లో అమ్మేస్తున్నారు. వాస్తవ ధరకు మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. దీంతో బ్లాక్లో టిక్కెట్లు అమ్ముతున్నారంటూ క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.