వెస్టిండిస్ టూర్ కి అందుకే దూరం : ధోని

Update: 2019-07-20 14:03 GMT

గత కొద్ది రోజులుగా టీంఇండియా మాజీ కెప్టెన్ మరియు వికెట్ కీపర్ ధోని రిటైర్మెంట్ పై కధనాలు వస్తున్నాయి . నిజానికి వరల్డ్ కప్ తర్వాత ధోని రిటైర్ అవుతారని అందరు అనుకున్నారు కానీ ధోని వాటిపైన స్పందించింది లేదు .. అయితే వచ్చే నెలలో జరిగే వెస్టిండిస్ టూర్ కి ధోని అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు .. రెండు నెలల పాటు ధోని ఆర్మీతో గడపాలని అనుకుంటున్నాడు, అందువల్లే వెస్టిండిస్ టూర్ కి అందుబాటులో ఉండడం లేదని ధోని బీసీసీఐ కి తెలిపాడు . ఇదే విషయాన్నీ కెప్టెన్ కోహ్లికి మరియు సెలెక్షన్ కమిటికి చెప్పమని బీసీసీఐ అధికారులు తెలిపారు.దీనితో రిషబ్ పంత్ కి అవకాశం దక్కనుంది .  

Tags:    

Similar News