మాథ్యూస్ సెంచరీ

Update: 2019-07-06 13:06 GMT

భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక అనూహ్యంగా పుంజుకుంది. 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన ఏంజెలో మాథ్యూస్ క్రీజులో పాతుకుపోయాడు. 116 బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో 100 మార్క్ చేరుకున్నాడు. అంతకుముందు 76 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న మాథ్యూస్ తర్వాత వేగంగా ఆడాడు. బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో రాణించడంతో లంక మెరుగైన స్థితిలో నిలిచింది. 44 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్లకు 227 పరుగులు చేసింది. ఆఖర్లో మెరుపులు మెరిపించి 260 స్కోరు దాటించాలని మాథ్యూస్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 

Tags:    

Similar News