భక్తులతో రద్దీగా బెజవాడ అమ్మవారి ఆలయం..

Update: 2019-06-09 13:35 GMT



వేసవి సెలవులు ముగుస్తుండడం.. ఆదివారం కావడంతో విజయవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. జై భావనే నినాదాలతో అమ్మవారి ఆలయ పరిసరాలను మోగిపోయాయి. భక్తులు క్యూలైనులలో ప్రశాంతంగా వెళ్లి దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తమ ముడుపులు చెల్లించుకున్నారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి రావడం ఇదే. పవిత్ర దినాల్లో ఉన్నంత రద్దీ ఈరోజు కనిపించింది. 



Similar News