తిరుమల సమాచారం

Update: 2019-08-03 06:32 GMT

తిరుమల సమాచారం: ఈ రోజు శనివారం ఉదయం 5 గంటల సమయానికి,వేచి ఉండాల్సిన అవసరం లేకుండా శ్రీవారి దర్శనం లభిస్తోంది. వర్షాల కారణంగా వెంకన్న దర్శనానికి భక్తుల తాకిడి తగ్గింది. సర్వదర్శనానికి సుమారు మూడు నుంచి ఐదు గంటలు సమయం పట్టొచ్చు. ఇక శీఘ్రసర్వదర్శనం,ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్:300/-), దివ్యదర్శనం(కాలినడక) వారికి శ్రీవారి దర్శనం సుమారు రెండు గంటలలో లభించే అవకాశం ఉంది. నిన్న(శుక్రవారం) 68,507 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం దొరికింది. ఇక శుక్రవారం స్వామివారికి హుండీలో భక్తులుసమర్పించిన నగదు2.30 కోట్లు.

Tags:    

Similar News