16న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

Update: 2019-07-12 03:34 GMT

ఈనెల 16వ తేదీన తిరుమల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కాగా 16వతేదీ రాత్రి 7గంటల నుంచి 17వ తేదీ ఉదయం 5గంటల వరకు మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆరోజు చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్నా మూసివేయనున్నట్లు తెలిపారు. ఆలయ శుద్ధి అనంతరం శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తారని భక్తులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.

Tags:    

Similar News