తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ఈ రోజు శుక్రవారం ఉదయం 5 గంటల సమయానికి స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 22 గదుల్లో స్వామి వారి భక్తులు వేచియున్నారు.

Update: 2019-08-23 04:25 GMT

ఈ రోజు శుక్రవారం ఉదయం 5 గంటల సమయానికి స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 22 గదుల్లో స్వామి వారి భక్తులు వేచియున్నారు. భక్తులు స్వామివారి సర్వ దర్శనానికి 12 గంటలు సమయం పట్టే ఛాన్స్ ఉంది. అలాగే శీఘ్ర సర్వదర్శనం,ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ రూ.300/-), దివ్యదర్శనం(కాలినడకన) వారికి శ్రీవారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టవచ్చు. గురువారం నిన్న 74,438 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గిగింది. నిన్న 34,584 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. న్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు 3.43 కోట్లు.

Tags:    

Similar News