ఈరోజు మంగళవారం 25-06-2019 ఉదయం 5 గంటల సమయానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్ లు నిండి బయట క్యూలైన్లలో కూడా భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వారి సర్వ దర్శనానికి 22 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది..
నిన్న జూన్ 24 సోమవారం రోజున 82,528 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగింది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు 3.57 కోట్లు.