తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 5 గంటల సమయానికి. శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్ లు నిండిపోయాయి. క్యూ లైన్లలో కంపార్ట్మెంట్ల బయట భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వారి సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న జూన్ 18 మంగళవారం మొత్తం 83,840 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. అదే సమయంలో స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు 3.34 కోట్లు.