వైభవంగా గురుపౌర్ణిమ వేడుకలు

Update: 2019-07-16 05:14 GMT

గురుపూర్ణిమ ను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. వేదవ్యాసుడు పుట్టినరోజైన ఆషాఢ పౌర్ణిమ ను గురుపూర్ణిమగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భక్త జనకోటి తమ జీవన ప్రయాణానికి దారి చూపించే గురువుగా భావించే షిరిడీ సాయినాధుని కి ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

సాయీశుని ఆలయాలన్నీ తెల్లవారుజామునుంచే సందడిగా మారాయి. దేశవ్యాప్తంగా అన్ని బాబా ఆలయాల్లోనూ సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు..పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయాలన్నిటిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక షిరిడీ లోని సాయినాధుని సన్నిధికి భక్తులు పోటెత్తారు. దేశం నలుమూలల నుంచి భక్తులు షిరిడీశుని సందర్శించుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. 

Tags:    

Similar News