తిరుమల సమాచారం

తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది.

Update: 2019-08-13 02:28 GMT

తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుస సెలవుల కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. వైకుంఠం వెలుపల సైతం 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శన౦, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఏడుకొండలవాడిని నిన్న 92,291 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.17 కోట్లుగా ఉంది.

Tags:    

Similar News