తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Update: 2019-07-14 02:43 GMT

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం మొత్తం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. టైంస్లాట్, నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి కూడా 3 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

Tags:    

Similar News