తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల సాధారణరద్దీ కొనసాగుతుంది.
తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల సాధారణరద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు క్యూలో ఉన్నారు. వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. ఇక నిన్న (బుధవారం) శ్రీవేంకటేశ్వరస్వామివారిని 73,256 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 36,778 మంది భక్తులు నిన్న తలనీలాలు సమర్పించుకున్నారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు.