తిరుమలలో వైభవంగా పల్లవోత్సవం

Update: 2019-07-25 01:18 GMT

తిరుమలలో పల్లవోత్సవం వైభవంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని ఏటా పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్రదీపాలంకరణ సేవ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు మాఢవీధుల్లో ఊరేగారు. కర్ణాటక సత్రంలోని తోటకు వేంచేసిన మైసూర్‌ సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించటం ఈ ఉత్సవ ప్రత్యేకత. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. 

Tags:    

Similar News