కొంత మంది జంట అరటి పండ్లను తింటే కవల పిల్లలు పుడతారని నమ్ముతారు. జంటఫలాలను తినటం ద్వారా, స్వామికి అర్పించటం ద్వారా, ఎలాంటి దోషం రాదనీ శాస్రాలు చెబుతున్నాయి. అందంతో అహంకార పూరితయైన రంభ శ్రీమహావిష్ణువు శాపం వల్ల భూలోకంలో అరటి చెట్టుగా జన్మించిందని పురాణ సారాంశం. తాంబూలంలో మాత్రం జంట అరటిపండును పెట్టకూడదు. దానికి కారణం ఏకఫలమవుతుందనే.