శ‌బ‌రిమ‌ల‌కు వెళ్లిన మ‌హిళ‌పై కారంపొడితో దాడి..

Update: 2019-11-26 05:38 GMT
శ‌బ‌రిమ‌ల‌

శబరిమలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శబరిమల ఆలయానికి సామాజిక కార్యకర్తలు బయలుదేరారు. సామాజిక కార్యకర్తలు బిందు, తృప్తిదేశాయ్‌ను మార్గమధ్యలోనే నిరసనకారులు అడ్డుకున్నారు.

బిందుపై కారంపొడి చల్లి దాడి చేశారు. శబరిమల నుంచి వెళ్లిపోవాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. తృప్తిదేశాయ్, బిందును అక్కడి నుంచి పోలీసులు తరలించారు. శబరిమలలోకి వెళ్తానని తృప్తిదేశాయ్‌ చెబుతున్నారు. శబరిమలను దర్శించుకోవడం తమ హక్కని, మహిళలు శబరిమలలోకి ప్రవేశించొచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. శబరిమలలోకి వెళ్లకుండా ఎవరూ అడ్డుకోలేరని తృప్తిదేశాయ్‌ స్పష్టం చేశారు.



Tags:    

Similar News