నేడు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతి భవన్లో ప్రొటెం స్పీకర్గా వీరేంద్రకుమార్తో రాష్ట్రపతి ప్రమాణం స్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలుత ఎంపీగా ప్రధాని మోడీ ప్రమాణం చేయనున్నారు. 17వ లోక్సభలో ఎంపీగా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. తెలుగులోనే ఆయన ప్రమాణ పత్రం చదివారు. ఈ నెల 19న లోకసభ స్పీకర్ ఎంపిక , ఈ నెల 20న ఉభయ సభలకు చెందిన సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రసంగించారు. జులై 5వ తేదీన కేంద్ర బడ్జెట్ ను మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.