పూరీ జగన్నాధుని సేవలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Update: 2019-07-04 10:37 GMT

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జగన్నాథ స్వామిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని అమిత్ షా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి హారతి ఇచ్చారు. కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమిత్ షా గుజరాత్ కు రావడం ఇదే తొలిసారి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ పటేల్ కూడా జగన్నాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో ఆ ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Tags:    

Similar News