కేంద్ర హోంశాఖ సంచలన నిర్ణయం : జమాత్కు వెళ్లిన విదేశీయుల వీసాలు రద్దు
కేంద్ర హోంశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. తబ్లీగీ జామాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీయుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర హోంశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. తబ్లీగీ జామాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీయుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. మర్కత్కు వెళ్లొచ్చిన వాళ్ళ కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 400 కేసులకు తబ్లీగ్ జమాత్తో సంబంధం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.
దీనితో తబ్లీగ్ జమాత్ సభ్యులైన 960 మంది విదేశీయుల వీసాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. 960 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ర్టాలకు, రాష్ర్టాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని హోంశాఖ మంత్రి కార్యాలయం ట్వీట్లో వెల్లడించింది.