ఇరవై రూపాయల నాణేలు వస్తున్నాయి ..

Update: 2019-07-05 10:54 GMT

మనం ఇప్పటివరకు 1,2,5,10 రూపాయల నాణేలు మాత్రమే చూసాం . కానీ ఇప్పుడు కొత్తగా 20 రూపాయల నాణేలను చూడబోతున్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో త్వరలో ఇరవై రూపాయల నాణేలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మల సీతరామన్ వివరించారు .. అయితే దీనికి ముందే మోడీ 1,2,5,10 రూపాయల నాణేల డిజైన్ ని మార్చారు . వీటిని నేషనల్ ఇనిస్టిట్యూట్ అఫ్ డిజైన్ రూపొందించింది . ఇవి పాత నాణేల కంటే కొంచం బరువు ఎక్కువగా ఉంటాయి . ఇప్పుడు రానున్న కొత్త 20 రూపాయల నాణెం కూడా ఇంకా బరువుగా ఉండబోతుంది . మొత్తం 12 అంచులతో 8.54 బరువు ఉంటుంది . దీనిపై ఒకవైపు సింహం, అశోక స్తంభం, సత్యమేవ జయతే సూక్తి ఉంటుందని.. మరో వైపు రూ.20 అని రాసి ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే ఇవి అమలులోకి రానున్నాయి .. 

Tags:    

Similar News