ట్రిపుల్ తలాక్ విషయంలో గత ప్రభుత్వాలేవీ చేయలేని సాహసం బీజేపీ చేసింది: అమిత్ షా
ట్రిపుల్ తలాక్ విషయంలో గత ప్రభుత్వాలేవీ చేయలేని సాహసం బీజేపీ చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోడీ ట్రిపుల్ తలాక్ విషయంలో ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అమిత్ షా అన్నారు. ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఎబోలిషన్ ఆఫ్ ట్రిపుల్ తలాక్ ..కరెక్టింగ్ ఏ హిస్టోరింగ్ ర్యాంగ్ అనే అంశంపై ప్రసంగించిన అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా విమర్శించారు. ప్రధాన మంత్రిగా 2014లో నరేంద్ర మోడీ ఎన్నికవడమే సంతృప్తిపరచే రాజకీయాలు ముగియడానికి ఆరంభమని చెప్పారు. 2019లో వచ్చిన ప్రజా తీర్పు సంతృప్తిపరచే రాజకీయాలకు పూర్తిగా తెరదించిందని చెప్పారు.