Coronavirus: కేరళలో పెరుగుతున్న కరోనా పాజిటీవ్ కేసులు.. మూడేళ్ల చిన్నారికి కరోనా వైరస్
కేరళలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. నిన్నటికి నిన్న ఒకే కుటుంబంలో ఏకంగా ఐదుగురికి వైరస్ సోకగా తాజాగా మూడేళ్ల చిన్నారికి కరోనా పాజిటీవ్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల తమ మూడేళ్ల చిన్నారితో తల్లిదండ్రులు ఇటలీలో పర్యటించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నారికి కరోనా పాజిటీవ్ రావడంతో ఎర్నాకుళంలోని మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 94 దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. అయితే ఇప్పటి వరకు కరోనా వైరస్తో మొత్తం 3వేల 827 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల లక్షా 9వేల 969కి చేరింది. చైనాలో 3వేల 119 మంది మృతి చెందారు. ఇటలీలో 366, ఇరాన్లో 194 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియాలో కరోనాతో 50 మంది మృతి చెందారు. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు 39కి చేరాయి.