భారత్లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తమిళనాడులో ఇవాళ రికార్డు స్థాయిలో 805 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య 17,082గా ఉంది. ఈ రోజు మరో ఏడుగురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 118కి పెరిగింది. కరోనాను నుంచి కొలుకొని ఈ రోజు 407 మంది డిశ్చార్జి అయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 8,731 మంది రికవరీ అయ్యారు.