సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి సురవరం సుధాకర్ రెడ్డి రాజీనామా చేశారు. అనారోగ్య కారణంతో పదవి నుంచి తప్పుకున్నట్లు సీపీఐ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2012 నుంచి ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు. వరుసగా మూడోసారి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలొ కొనసాగుతున్న సురవరం మరో రెండు సంవత్సరాలు పదవికాలం ఉండగానే వైదొలిగారు. సీపీఐ నూతన ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యులు వి.రాజను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. సీపీఐ జాతీయ మండలి సమావేశంలో రాజా నియామకాన్ని ఆమోదించనున్నారు.