నరేంద్ర - దేవేంద్ర ఫార్ములా సూపర్ హిట్

మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే రాష్ట్రం వేగంగా అభివృద్ధి సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహారాష్ట్రలోని పాన్వేల్‌లో ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు.

Update: 2019-10-16 14:06 GMT

మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే రాష్ట్రం వేగంగా అభివృద్ధి సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహారాష్ట్రలోని పాన్వేల్‌లో ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రగతి పథంలో దూసుకుపోవాలంటే ఢిల్లీలో మోదీని రెండో సారి గెలిపించినట్లే మహారాష్ట్రాలో కూడా దేవేంద్రఫడ్నవీస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్లగా నరేంద్ర దేవేంద్ర కాంబినేషన్ విజయపథంలో దూసుకుపోయిందని అన్నారు. నరేంద్ర-దేవేంద్ర ఒకే చోట ఉంటే 1+1=2 కాదు 11 అవుతుంది. మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే రాష్ట్రం పదింతలు ముందుకెళ్తుందని మోదీ అన్నారు.

నూతన భారత్ నిర్మించే పనిలో ఉన్నామని ప్రజలు జీవిన ప్రమాణాలతో జీవించాలని తెలిపారు. గొప్ప దేశంగా భారత్ అవతరిస్తుందని దానికి మహారాష్ట్ర ప్రజల కృషి అవసరమని మోదీ తన ప్రసంగంలో తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ 288 స్థానాలకు ఈనెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 24వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. 

Tags:    

Similar News