కాసేపట్లో ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్పవార్ భేటీ
-ప్రాధాన్యత సంతరించుకున్న మోడీ, పవార్ సమావేశం -మహారాష్ట్ర ఇష్యూపై చర్చించనున్నట్లు సమాచారం
మహారాష్ట్ర రాజకీయాలు పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. అక్కడ పరిస్థితుల్లో రోజుకో ట్విస్ట్ కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకై కాంగ్రెస్-ఎన్సీపీ ఇవాళ సమావేశం కానున్న తరుణంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. ప్రధాని మోడీతో మధ్యాహ్నం భేటీ కానున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్రలోని రైతుల సమస్యలపై ప్రధాని మోడీతో పవార్ చర్చించనున్నట్లు ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు ఆవరణలోనే వీరి భేటీ జరగనుంది. శివసేనతో పొత్తు విషయంలో ముందుకు వెళ్లడంపై ఈరోజు సాయంత్రం కాంగ్రెస్-ఎన్సీపీలు మరోకీలక భేటీ నిర్వహించనున్నాయి. వీరిద్దరి మధ్య మహారాష్ట్ర రాజకీయ పరిస్థితి కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.