ఫడ్నవిస్ ప్రభుత్వ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అజిత్ పవార్ను ఎన్సీపీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. శివసేన- కాంగ్రెస్- ఎన్సీపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించామన్నారు. తమకు 170 మంది సభ్యుల బలం ఉందన్నారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడికీ వెళ్లలేదని మాతోనే ఉన్నారని స్పష్టం చేశారు. బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ చేతులు కలిపేది లేదని స్పష్టం చేశారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసిందన్నారు. ప్రజాతీర్పును అవమానించారని తమపై ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు.